ఢిల్లీలో బాలిక‌పై దాడి వీడియో వైర‌ల్ .. మ‌హిళా క‌మిషన్ సీరియ‌స్

-

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలిక‌పై ఒకరు విచ‌క్షణారాహిత్యంగా దాడి చేశాడు. క‌ర్ర, బూట్లు ల‌తో ఆ బాలికపై దాడి చేశాడు. కాగ ఈ దాడి ద‌గ్గ‌ర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. కాగ దాడి పై ఢిల్లీ మ‌హిళా క‌మిషన్ సీరియ‌స్ అయింది. 48 గంట‌ల్లో దాడి చేసిన యువ‌కున్ని ప‌ట్టుకోవాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను ఆదేశించింది. కాగ ఢిల్లీలోని ప‌శ్చిమ విహార్ ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి.. బాలికను ప‌ట్టుకుని క‌ర్ర‌తో తీవ్రంగా దాడి చేశాడు.

ఆ బాలిక త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. బూట్ తో దాడి చేశాడు. ఈ దాడి మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అలాగే ఈ దాడిపై స్థానికంగా ఉండే.. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మ‌హిళా క‌మిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా దాడికి సంబంధించిన వీడియో ను కూడా అందించింది. దీంతో దాడిపై మ‌హిళా క‌మిషన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దాడికి పాల్ప‌డ్డ యువ‌కున్ని 48 గంటల్లో అరెస్టు చేయాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news