జగద్గిరిగుట్టలో జొన్నరొట్టెలు అమ్ముకునే మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. దుద్దగొడ దుర్గన్న, భార్య కవిత(35) జగద్గిరిగుట్ట శిరిడీ హిల్స్లో ఉంటూ.. జొన్నరొట్టెలు విక్రయిస్తుంటోంది. గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ కమలా ప్రసన్ననగర్లో ఉంటున్న మెదక్ జిల్లాకు చెందిన బేగరి యాదయ్య మద్యం మత్తులో వచ్చి రొట్టెలు తయారు చేస్తున్న కవితతో గొడవపడి.. కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది.
జగద్గిరిగుట్టలో మహిళ దారుణ హత్య
By Network
-
Previous article
Next article