మెదక్ : యువకుడు మిస్సింగ్

-

ఓ యువకుడు అదృశ్యమయిన ఘటన అల్లాదుర్గంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అల్లాదుర్గం ఐబీ తండాకు చెందిన వి.శ్రీనివాస్ (20) సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్నాడు. గత నెల 28న ఉదయం 11గంటలకు తన స్వగ్రామం నుండి కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో తండ్రి వడ్త్య గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news