ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా.. నేడు 15 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు ప్ర‌తి రోజు త‌గ్గుతూనే ఉన్నాయి. అయితే నిన్న‌టితో పోలిస్తే.. నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా వైరస్ బులిటెన్ విడుదల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 15 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 5 కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి.

అంటే.. నిన్న‌టితో పోలిస్తే.. నేడు 10 కేసులు ఎక్కువ న‌మోదు అయ్యాయి. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 288 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌త నెల రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌.. 8,349 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news