కూల్చిన క్రికెటర్ శ్రావణి ఇంటి వద్ద ధర్నా చేస్తాం – టీఆర్‌ఎస్‌ కు వీహెచ్‌ వార్నింగ్‌

-

కూల్చిన క్రికెటర్ శ్రావణి ఇంటి వద్ద ధర్నా చేస్తామని టీఆర్‌ఎస్‌ సర్కార్‌, జీహెచ్‌ఎంసీకి వీహెచ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తూకారం గేట్ లోని దళిత క్రికెటర్ శ్రావణిని వీహెచ్‌ పరామర్శించారు. తుకారాం గేట్(అడ్డ గుట్ట)లో క్రికెటర్ శ్రావణి ఇంటిని కూల్చివేడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీహెచ్‌ పేర్కొన్నారు. క్రికెటర్ శ్రావణి ఎస్సి దళిత అమ్మాయి కనుకనే వివక్ష చూపిస్తున్నారని టీఆర్‌ఎస్‌ పై మండిపడ్డారు.

కూల్చిన ఇంటిని పరిశీలించిన వీహెచ్‌… మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్ తో స్పాట్ నుండి ఫోన్ లో మాట్లాడారు. బావ, బావమర్ధుల ఇంటి పంచాయితీలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఎలా ఇంటిని కూల్చివేస్తారని ప్రశ్నించారు. క్రికెటర్ శ్రావణికి న్యాయం జరిగే వరకు స్పోర్ట్స్ టీంలతో న్యాయపోరాటం చేస్తామని ప్రకటన చేశారు. రేపు కూల్చిన ఇంటి వద్దనే ధర్నా చేస్తామని..క్రికెటర్ శ్రావణికి న్యాయం చేసేవరకు పోరాటం ఆగదని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news