IRCTC షిర్డీ టూర్ ప్యాకేజీ.. ఒక్క రోజులో దర్శనం చేసుకు వచ్చేయచ్చు…!

-

ఎన్నో కొత్త ప్యాకేజీలను IRCTC తీసుకు వస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజల కోసం వివిధ రకాల టూర్ ప్యాకేజీలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవులని దృష్టిలో పెట్టుకొని టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీలతో తక్కువ ఖర్చుతో మీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సులభంగా పర్యటించవచ్చు.

 

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా షిర్డీ సాయి భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… తాజాగా షిర్డీ సాయి భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకు రావడం జరిగింది. పైగా తక్కువ రోజుల టూర్ ఏ ఇది. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులు రాజధాని ఢిల్లీ నుంచి షిర్డీకి తరువాత షిర్డీ నుంచి ఢిల్లీకి రావచ్చు.

మీరు షిర్డీలో పికప్, డ్రాప్ సౌకర్యం పొందుతారు. అలానే ఫ్లైట్ దిగిన తర్వాత ప్రయాణించడానికి AC కారు సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీని రెండు రోజుల పాటు షెడ్యూల్ చేసింది. మొదటిది 23 ఏప్రిల్ 2022. రెండోది 14 మే 2022. ఇక ప్యాకేజీ వివరాలను చూస్తే.. ఏప్రిల్ 23న విమానంలో ఢిల్లీ నుంచి షిర్డీకి చేరుకుంటారు. ఆ తరవాత హోటల్ లో స్టే చెయ్యాలి.

మధ్యాహ్న భోజనం తరువాత శని శింగనాపూర్‌ని సందర్శించవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చి హోటల్‌లో స్టే చెయ్యాలి. ఉదయం షిర్డీకి వెళ్లి తరవాత దర్శనం చేసుకుని భోజనం చేసి విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తారు. ఇక ధరల గురించి చూస్తే.. సింగిల్ ప్యాసింజర్‌కి అయితే రూ. 16,970 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తికి రూ.15,960 చెల్లించాల్సి ఉంటుంది. అదే ముగ్గురు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తి రూ.15,760 చెల్లించాల్సి ఉంటుంది. IRCTC వెబ్‌సైట్‌ లో పూర్తి వివరాలను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news