బాలీవుడ్‌ నటి మంజూ సింగ్‌ కన్నుమూత

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి మృతిచెందారు. ప్ర‌ముఖ న‌టి,నిర్మాత టెలివిజ‌న్ వ్యాఖ్యాత మంజూసింగ్ మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 74 సంవ‌త్సరాలు. ఆమె మృతిప‌ట్ల హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. 80 వ ద‌శ‌కంలో టెలివిజ‌న్ తోపాటు సినిమా రంగంలోఆమె మంచి గుర్తింపు పొందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె… తాజాగా ఆమె ఆరోగ్యం బాగాక్షీణించ‌డంతో.. మృతి చెందిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news