మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం..

-

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో జరిగింది. అయితే నిందితుడైన యువకుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అంతలోనే ఆ బాలిక విషం తాగి మరణించింది. . ఆమె మీద అత్యాచారం జరిగిన ఒక రోజు తర్వాత బాలిక సూసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెడితే.. యుపిలోని ఫతేపూర్ జిల్లాలోని చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 15 ఏళ్ల దళిత బాలిక మంగళవారం సాయంత్రం తన గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు.. ఆమెను చూశాడు. ఆమె వెంటపడి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే, బైటికి వెళ్లిన బాలిక రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకగా అడవిలో స్పృహలేని స్థితిలో కనిపించిందని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలిక మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున విషం తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news