శోభిమచ్చలతో బాధపడుతున్నారా..కారణాలు నివారణ మార్గాలు ఇవే..!

-

ఒక ఏజ్ దాటాకా శరీరరంపై మచ్చలు ఏర్పడటం ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇవి ముఖం మీద వస్తే..ఇంకా ఇబ్బందిగా ఉంటాయి. వీటిని తగ్గించుకోవటం కోసం చాలా క్రీమ్స్ వాడుతాం. అయినా ఇవి ఆశింషినంత ఫలితాన్ని ఇవ్వవు. వీటిని శోభిమచ్చలు అంటారు. ఇవి కొందిరికి తెల్లగా ఉంటే..మరికొందరికి నల్లగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి ముక్కుమీద, బుగ్గలమీద, నుదుటిమీద వస్తాయి. మహిళల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అసలు చాలామందికి ఇవి ఎందుకు వస్తాయో కూడా తెలియదు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌గా ఇది వస్తుంది. వైద్యశాస్త్రంలో దీన్ని టీనియా వెర్సికలర్ అంటారు. ఇది పెద్ద వయసు వారిలోను, మధ్య వయస్సు వారిలోను ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈరోజు మనం ఇవి ఎందుకు వస్తాయి, అధిగమించటం ఎలానో చూద్దాం.

ఈ సమస్య ఉన్నవారిలో చర్మం తన సహజరంగును కోల్పోతుంది. ముదురు ఎరుపువర్ణంలో, లేత గోధుమవర్ణంలో, తెలుపు వర్ణంలో ఈ మచ్చలు ఉంటాయి. వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఇలాంటి శోభి లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసందర్భాల్లో ఈ మచ్చలకు చుట్టూ ఓ అంచులాంటిది ఏర్పడుతుంది. ఈ మచ్చలున్న చోట ఒక్కోసారి విపరీతమైన దురద కూడా ఉండవచ్చు. అయితే శోభిమచ్చలు అంటువ్యాధి ఏం కాదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీరూ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.

కారణాలు

చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్‌ అనే ఫంగస్‌ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ ఫంగస్‌ చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. అయితే.. అందరి చర్మంలోనూ ఈ ఫంగస్‌ ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఎవరిలో ఎక్కువగా ఉంటాయి..

►పౌష్టికాహార లోపం ఉన్నవారిలో
►వ్యాధినిరోధకతశక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో
►స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవారిలో
►గర్భవతులలో
►హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో…
►జిడ్డు చర్మం ఉన్న వారిలో
►తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో
►కొందరిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది.
►తామరగా/ఇతర సమస్యలుగా పొరబడటం సాధారణం…
►బాగా ఎక్కువగా చెమటలు పట్టడం, అధికవేడి కారణంగా..వీరిలో ఇలాంటివారిలో ఈ మచ్చలున్నచోట దురదలూ రావచ్చు.

కొందరు శోభిని చూసి తామర అనుకుని పొరబడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్‌ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. కెఓహెచ్‌ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనే విషయాన్ని అందువల్ల డెర్మటాలజిస్టులు నిర్ధారణ చేసి, తగిన చికిత్స సూచిస్తారు.

జాగ్రత్తలు

ఇది తేలిగ్గా నివారతమయ్యే సమస్యే కాదు. చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి. మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. చర్మం బాగా జిడ్డుగా ఉన్నప్పుడు… ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే మరీ పొడిగానూ ఉంచకూడదు. శరీరం మీద నూనెగానీ, లేదా నూనెకు సంబంధించిన జిడ్డు పదార్థాలను కాని రాయకూడదు. బాగా బిగుతుగానూ, గాలిచొరకుండా ఉండే దుస్తులు ధరించటం తగ్గించండి.. ఇది మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఎక్కువ చెమట పట్టకుండా చూసుకుంటూ,S కెటొకోనటోల్‌ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడటం బెటర్.

చికిత్స

రోగం ఒకటే అయినా..తగిన చికిత్స మాత్రం అందరిలో ఒకేలా ఉండదు..అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్మవ్యాధి నిపుణులు చికిత్స అందిస్తారు. మచ్చలు ఉన్నవారి.. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తి తాలూకు మెడికల్‌ హిస్టరీ… వంటి వాటిని ఆధారంగా చేసుకుని చికిత్స ఉంటుంది. ఫంగస్‌ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. లూలిఫిన్‌ వంటి యాంటీ ఫంగల్‌ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి మచ్చలున్న చోట అప్లై చేయాలి. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకెనజోల్‌ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ చాలా ఎక్కువగా ఉంటే, నోటితో తీసుకునే మందులను డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది.

వివిధ రకాల మచ్చలకు ఇంటి చిట్కాలు:

తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రిపోయే ముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేయాలి..రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి
మినుములు చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తాయి. మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.
స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గి.. శరీరం కాంతివంతంగా మారుతుంది.
తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనంగా పూయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.
నల్లజిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతాయి.
తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి.
వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలేట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news