కెసిఆర్ కు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు: వైయస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మడుపల్లి గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతూ.. కెసిఆర్ కు మరోసారి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ కు సీఎం పదవిని కట్టబెడితే.. 8 ఏళ్లుగా ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతోందని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకే తాను పార్టీని స్థాపించారని షర్మిల చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని, ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news