మహేష్ బాబు మూవీ లో ఐశ్వర్యరాయ్.. రూమర్స్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇకపోతే మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ కాంబినేషన్లో షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలపగా..అధికారికంగా అయితే ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నట్లు త్రివిక్రమ్ తెలిపారు.Aishwarya Rai to make her comeback with southern superstar Mahesh Babu | Bollywood News – India TV

మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక అద్భుతమైన కథను అందించడం జరిగింది. అంతే కాదు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన కథ మహేష్ బాబు కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ఒక కీలక పాత్రలో నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రాజమౌళి తో పాటు చిత్ర యూనిట్ ఇప్పటికే ఐశ్వర్య రాయ్ ని కలిసినట్టు.. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.మహేష్ బాబు సినిమాతో ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ? | Aishwarya Rai comeback film with Mahesh Babu? - Telugu Filmibeat

అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటిస్తే ఖచ్చితంగా మరింత ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఈ విషయం పై క్లారిటీ రావాలి అంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news