షర్మిల పార్టీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

షర్మిల పార్టీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తల్లి విజయలక్ష్మీ కోపంగా ఉన్న మాట వాస్తవం కాదా..? చెల్లి షర్మిళ మాట వినడం లేదని వైసీపీనే చెప్పింది కదా..? అని ప్రశ్నించారు. షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టడం నిజం కాదా..? అని నిప్పులు చెరిగారు. జగన్‌, షర్మిలకు మధ్య విభేధాలు ఉన్నాయని అందుకే.. ఆమె పార్టీ పెట్టిందన్నారు.

పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదేని.. కార్యకర్తలనే కాదు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కర్ని మాకు చేతనైనంత వరకు ఆదుకుంటామని భరోసా కల్పించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ మా పార్టీ కాదు.. అయినా ఆ కుటుంబానికి మేం అండగా నిలిచామని. వాస్తవాలేమైనా ఉంటే అందరూ మాట్లాడతారన్నారు. జగన్ గురించే కాదు.. నా గురించీ మాట్లాడతారు.. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏమైనా చెప్పాలనుకుంటే సమాధానం చెప్పాలి కానీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తారా..? ఒక్కరిని కొడితే పది మంది తిరిగి కొడతారు.. జాగ్రత్త హెచ్చరించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్స్ చేసే స్థాయిలో కొందరు పోలీసులు ఆలోచన చేస్తున్నారు… రక్షణ కల్పించాల్సిందిగా అయ్యన్న కోర్టుకెళ్లారు…ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటానని రక్షణ కల్పించాలని ఎంపీ రఘు రామకృష్ణం రాజు కోర్టుని ఆశ్రయించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news