IND VS ENG : చరిత్ర సృష్టించిన రోహిత్..ఏకైక కెప్టెన్ గా రికార్డు

-

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టి20 లో వరుసగా 13 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. టి20 చరిత్రలో ఇదే రికార్డు. మొత్తంగా చూసుకుంటే రోహిత్ శర్మ టీమిండియా ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా 15 విజయాలు నమోదు చేసుకున్నాడు.

అంటే వన్డేలు t20 లతో కలిపి ఈ రికార్డు నమోదు చేసుకున్నాడు రోహిత్. కాగా… ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొదటి టీ20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. హార్థిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం కారణంగా ఇంగ్లాండ్ తో 32 టి20 సిరీస్ ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. గురువారం తొలి టీ 20 లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

198 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు… 148 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 19.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 148 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news