బాలీవుడ్ నుంచి మరొక జంట బ్రేక్ అప్..!!

-

ఏ సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేకప్ లు సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. నచ్చిన హీరో, హీరోయిన్లు ప్రేమలో పడడం , డేటింగ్ చేసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో బాలీవుడ్ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వారెవరో కాదు యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అలాగే దిశా పటాని.వీరిద్దరూ కూడా గత కొన్ని రోజులుగా రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి ప్రేమ హద్దులు కూడా దాటింది. కుటుంబ సభ్యులకు కూడా దాదాపుగా వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ముఖ్యంగా పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు రావడంతో వీరిద్దరూ కలిసి.. అందుకు తగ్గట్టుగానే ఎన్నో పబ్బులకు , పార్టీలకు వెళ్లడం వరుసగా సినిమాలలో కూడా నటించడం అన్నీ చేశారు . కానీ అనూహ్యంగా బ్రేకప్ అవుతున్నామంటూ చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. సుమారుగా ఆరు సంవత్సరాల పాటు రిలేషన్ లో ఉన్న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న క్రమంలో ఇలా బ్రేకప్ చెప్పుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడం గమనార్హం. ఇకపోతే ఈ విషయాన్ని తెలుసుకున్న వారి అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బాలీవుడ్ వర్గాలలో కూడా ఈ విషయం చాలా ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అంటూ వార్తలు వస్తున్న సమయంలో వీరు ఇలా బ్రేకప్ కు కారణం ఏమై ఉంటుందని విడిపోవడానికి ఎవరైనా కారణం అయ్యారా అనే వార్తలు కూడా బాలీవుడ్ లో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే హీరోగా, హీరోయిన్ గా ఇద్దరూ బిజీగా ఉంటే కచ్చితంగా ఏదైనా రిలేషన్ లో విభేదాలు వచ్చి ఉంటాయా అంటూ కొంతమంది ఊహగానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం విడిపోవడానికి గల కారణాలను చెప్పకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news