కామారెడ్డి జిల్లాలో విషాదం..SI పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య

-

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. SI పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల 20 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేనని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది యువతి.

హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తూ మార్గ మధ్యలో జంగంపల్లి గ్రామ స్టేజి వద్ద దిగిన యువతి… ఆత్మహత్యకు పాల్పడింది. మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలుగా గుర్తించారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు భిక్కనూర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news