గోరంట్ల మాధవ్ వీడియో పై గవర్నర్ ని కలవనున్న మహిళా జేఏసీ

-

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పైనే ఏపీ రాజకీయాల చర్చ నడుస్తోంది. అయితే అది ఫేక్ వీడియో అని తేల్చేశారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. పైగా ఆ వీడియో ఒరిజినల్ కాదని కూడా స్పష్టం చేశారు. అయితే తాజాగా శనివారం సాయంత్రం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ను కలవనున్నారు మహిళా జేఏసీ నేతలు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు మహిళా జేఏసీ నేతలు.

గురువారం జరిగిన మహిళా జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో గవర్నర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలియజేశారు. గోరంట్ల మాధవ్ కు క్లీన్ చీట్ ఇచ్చేలా వ్యవహరిస్తున్న అనంత జిల్లా ఎస్పీ ఫకీరప్ప నిర్వాకాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మహిళా జేఏసీ నేతలు. ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడి.. మాధవ్ ను ఏ విధంగా రక్షిస్తుందన్నన విషయాన్ని.. గవర్నర్ కి వివరిస్తామన్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు తనకున్న విశేషాధికారాలను వినియోగించాల్సిందిగా గవర్నర్ ను కోరతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news