అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ యాత్ర – నాదెండ్ల మనోహర్

-

ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటి విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని జనసేన చేపట్టినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. జనసేన నిర్వహించిన ఐటీ సమ్మేటిలో 600 మంది నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన సరికొత్త ఐటి పాలసీతో ముందుకు వస్తోందన్నారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఐటీ లో హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఎందుకు అలా చేయలేకపోతుందని బాధ కలుగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news