నేడు వైసీపీలోకి నేదురుమల్లి?

-

ఏపీ భాజపాకు మరో దెబ్బ

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి నేడు వైసీపీలో చేరనున్నారు. శనివారం ఉదయం 11గంటలకు విశాఖ జిల్లా పెందుర్తి లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కార్యకర్తల అభిప్రాయం, రాజకీయ భవిష్యత్ ని అంచనా వేసుకుని గత కొద్ది రోజుల క్రితమే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్ ను ఆయన కలిసిన సంగతి తెలిసిందే. వెంకటగిరి ఎమ్మెల్యే స్థానం లేదా విశాఖ ఎంపీ టికెట్ ను రాంకుమార్ రెడ్డి కోరగా జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నేడు పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇప్పటికే పెందుర్తికి చేరుకున్నారు. . ప్రస్తుతం రాంకుమార్ రెడ్డి  భాజపాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు..దీంతో ఆయన పార్టీ మారడంతో  ఏపీ భాజపాకి మరో కోలుకోలేని దెబ్బతగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news