ఎవరూ తొందరపడొద్దు.. అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

తన అనుచరులు ఎవరూ తొందరపడొద్దని, త్వరలోనే తమకు మంచి రోజులు వస్తాయని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. త్వరలోనే భగవంతుడే తమకు మంచి మార్గం చూపిస్తాడని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తన అనుచరులతో పొంగులేటి మాట్లాడుతూ ‘ఇంకేంటి శీనన్న.. ఇంకేంటి శీనన్న అనే ఉత్కంఠ ఎవరికీ వద్దు. మీ వెంట ఉండేవారిలో అదే ఉత్కంఠ తేవొద్దు. కాలం, సందర్భం అన్నీ భగవంతుడే నిర్ణయిస్తాడ’న్నారు. ‘మనం ఉరికి ఉరికి బోర్లపడాల్సిన అవసరం లేదు. మీ గుండెల్లో స్థానం ఇచ్చిన దేవుడే మనందరికీ మంచి మార్గం చూపిస్తాడ’ని పొంగులేటి వ్యాఖ్యానించారు.

త్వరలోనే మంచి ఫలితం వస్తుందని, తనను నమ్ముకున్న అందరికీ అందులో వాటా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపాలిటీ ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, సర్పంచి శీలం విజయలక్ష్మి, ఏఎంసీ ఛైర్మన్‌ రత్నం, ఎంపీపీ పావని, జడ్పీటీసీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news