గోరంట్ల మాధవ్ ని రక్షించినట్టే నాగరాజును రక్షిస్తారా?: నారా లోకేష్

-

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడు గుంటలోని ఓ కాలనీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. బాలిక తండ్రి ఆ సమయంలో ఇంట్లో లేరు. తల్లి కూడా పనిపై బయటకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి ఇదే అదునుగా భావించాడు మేనమామ నాగరాజు.

మేనమామ అత్యాచారానికి ప్రయత్నించడంతో వారించిన బాలిక బాత్రూం లోకి పరుగులు తీసింది. చివరకు బాత్రూం లో ఆమెను బంధించిన నాగరాజు అక్కడ యాసిడ్ తీసి ఆమెపై పోసాడు. కత్తితో గొంతు కోసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కొన ఊపిరిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు.

” ఆవు చేలో మేస్తే, దూడ గట్టునమేస్తోందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారు తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయిని చంపేస్తే.. వైకాపా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇదిగో ఇలా ఊరు మీద పడి అన్యం పుణ్యం ఎరుగని బాలికలపై మానవత్వానికే మాయని మచ్చలా దాడులకి తెగబడుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నాగరాజు వైకాపా కార్యకర్త కావడంతో పోలీసులు ఏ కట్టు కద అల్లుతారో? ఎంపీ గోరంట్ల మాధవ్ ని రక్షించినట్టే రక్షిస్తారో? జగన్ రెడ్డి సీఎం కావడంతోనే నేరస్తులు, దోపిడీదారులు, రేపిస్టులు ఇది తమ రాజ్యమన్నట్టు చెలరేగిపోతున్నారు”. అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news