సూర్యాపేట ఎస్పీపై ఉత్తమ్ ఫైర్.. ఎమ్మెల్సీని చేస్తారేమోనంటూ సెటైర్

-

రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని పొగుడుతూ సూర్యాపేట జిల్లా ఎస్పీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై పలువురు రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకులపై ఎలా ప్రశంసలు గుప్పిస్తారని మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఓ కార్యక్రమంలో పొగుడుతూ నినాదాలు చేసిన తీరును నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తప్పుబట్టారు. దీనిపై వ్యంగ్యంగా ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ తెరాస కార్యకర్తలాగా నినాదాలు చేస్తూ.. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని బాహుబలి అంటూ పిలిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాదాలను తాకిన కలెక్టర్‌ను ఎమ్మెల్సీ చేసినట్లుగానే రాజేంద్ర ప్రసాద్‌ను కూడా కేసీఆర్‌ ఎమ్మెల్సీ చేస్తాడనే నమ్మకం తనకుందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news