నేషనల్ హెరాల్డ్ కేసులో టీ-కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

-

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. కాంగ్రెస్‌కు, పార్టీ అనుబంధ సంస్థలకు విరాళమిచ్చిన కొందరికి నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసులు అందుకున్న వారిని కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీకి రమ్మని తెలిపింది. నిన్ననే కొందరు కాంగ్రెస్ నాయకులు దిల్లీ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం దిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఈడీ సోనియా, రాహుల్‌ను విచారించింది. కేసులో భాగంగా విరాళమిచ్చిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. కేసు పూర్వాపరాల గురించి కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు అందుకున్న వారికి వివరాలు తెలియచేయనుంది. ఇప్పటికే షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, అంజన్​కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్‌ దిల్లీ వెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news