స్టార్ హీరోల కు ట్వీట్స్ తో చురకలు అంటిస్తున్న వర్మ..!!

-

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే  ప్రస్తుతం తాను తన సినిమా లతో కాకుండా తన ట్వీట్స్ తోనే క్రేజ్ సంపాదిస్తూ వున్నాడు. ఎలాంటి ఇష్యూ వచ్చినా తన దైన శైలిలో ట్వీట్ చేస్తూ అందులో వేలు పెడతారు. అవతలి వారిని నోరు తెరవకుండా తన ట్వీట్స్ తోనే ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఓకే విషయాన్ని తప్పుగా, ఒప్పుగా కూడా చెప్పగలగడం రామ్ గోపాల్ వర్మ సొంతం.

తాజాగా డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన  కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటుంది. ఈ సినిమాను కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలివిగా ఆలోచించి ,తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసి వెంటనే రిలీజ్ చేశారు. ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేస్తోంది.ఈ చిత్రం సక్సెస్ పై ప్రభాస్, అనుష్క, ధనుష్ వంటి సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకుంది

తాజాగా  రామ్ గోపాల్ వర్మ కన్ను ఈ సినిమా పై పడింది. ఈ సినిమా గురించి కాంట్రవర్సీ పోస్ట్ పెట్టడం జరిగింది. థియేటర్స్ కి జనాన్ని పెద్ద బడ్జెట్ ఉన్న చిత్రాలే తీసుకువస్తాయి అనే నమ్మకాన్ని రిషబ్ శెట్టి బద్దలు కొట్టాడని,  కొన్ని దశాబ్దాలు పాటు కాంతారా విజయం ఒక పాఠంగా నిలిచిపోతుంది అని మన స్టార్ హీరోల పై చురకలు వేశారు. మరీ ముఖ్యంగా ఈ ట్వీట్ మెగాస్టార్ చిరంజీవి గురించే అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా చోట్ల గాడ్ ఫాదర్ సినిమా తీసేసి కాంతారా సినిమాను వేస్తున్నారు. దీన్ని చూసే వర్మ ఇలా ట్వీట్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news