ఒరేయ్ పిరికిపందల్లారా అందరూ కలిసి రండి చూసుకుందాం – అంబటి రాంబాబు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లు కలవడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ  మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. “జనసైనికులా? బాబు బానిసలా? యుద్ధానికి సిద్ధమన్నావు, చంద్రబాబు సంకెక్కావు, పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం!” అంటూ వరుస ట్వీట్ లు చేశారు.

టిడిపి, జనసేనలు రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయనే అర్థంతో అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.మా ఎమ్మెల్యేలను కాదు.. కనీసం మా కార్యకర్తలను టచ్ చేసి చూడు ఏమి జరుగుతుందో? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజానికి పవన్ కళ్యాణ్ నాంది పలుకుతున్నాడని ఆరోపించారు. నియోజకవర్గాలలో తిరిగి చూడు ఏమి జరుగుతుందో? అని హెచ్చరించారు. నోటికి ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news