థియేటర్ లో పట్.! కాని ఓటీటీలో మాత్రం సూపర్ హిట్.!

-

గతంలో సినిమా అభిమానులు థియేటర్స్ లోనే సినిమాను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించే వారు. ప్రస్తుతం టిక్కెట్స్ రేట్లు పెరగటం,  స్నాక్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా వుండడం తో ఒక ఫ్యామిలి కి చాలా ఖర్చు అవుతోంది. దానికి తోడు ఓటిటి ల, కరోనా దాడితో చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కు దూరం అయ్యారు. దీనికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు రాక పోవడం కూడా ఒక కారణం అయ్యింది. ప్రస్తుతం థియేటర్స్ లో దమ్ము చూపని సినిమాలు ఓటి టి లో మాత్రం హిట్ అవుతున్నాయి.

అలాంటి కోవకు చెందిన సినిమానే బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా వచ్చిన ఫ్యామిలీ చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా  ఈ నెల 5న దసరా కానుక గా రిలీజ్ అయ్యింది. స్వాతిముత్యం సినిమా సరోగసి పై మెయిన్ థీమ్ గా చూపిస్తూ ,హీరో హీరోయిన్ మధ్య ఉండే సన్నివేశాలు , ఫ్యామిలీ సన్నివేశాలు మరియు పెళ్ళి సీన్స్ తో సినిమా హిలేరిస్గా సాగిపోయింది.

పైన చెప్పిన కారణాల తో పాటు , పెద్ద హీరోల సినిమాలు వుండడం వల్ల థియేటర్స్ లో ఈ సినిమా సరిగా ఆడలేదు. దానితో ఈ సినిమాను  ఈ నెల 24 తేదీ నుండి  ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేశారు. ఈ సారి కుటుంబ ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వదిలి పెట్టకుండా చూసారు. దీనితో ఈ సినిమా కు  ఏకంగా 50 మిలియన్ల వ్యూ మినిట్స్  వచ్చాయి.ఈ విషయాన్ని  ఆహా టీమ్ అధికారకంగా ప్రకటించింది

Read more RELATED
Recommended to you

Latest news