గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో తల్లి..!

-

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే తారలు అలాగే వారి కుటుంబ సభ్యులు తరచూ ఏదోక విషయమై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ కూడా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అమీర్ ఖాన్ స్పందించలేదు. తల్లిని చూసేందుకు ఫ్యామిలీతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు అమీర్ ఖాన్.

ఇదిలా ఉండగా దీపావళి వేడుకల్లో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇటీవల సంతోషంగా పాల్గొనడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఆమెకు ఇలా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే గుండెపోటు రావడానికి గల కారణాలు ఏమిటా అని వైద్యులు సైతం ఆరాధిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అమీర్ ఖాన్ అభిమానుల సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇక అమీర్ ఖాన్ అప్ కమింగ్ మూవీ లిస్ట్ విషయానికి వస్తే ఇటీవలే కరీనాకపూర్ తో కలిసి తెరకెక్కించిన లాల్ సింగ్ చద్దా సినిమా థియేటర్లలో పర్వాలేదు అనిపించుకుంది.

ఇప్పుడు మరొక రీమేక్ సినిమా చేయబోతున్నారు.. అనుష్క శర్మ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా 2023లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మొగల్ చిత్రాన్ని 2024 లోపు కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈమధ్య కాలంలో తరచు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడని చెప్పాలి. లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల సమయంలో కూడా ఈ సినిమా బాయికాట్ చేయాలంటూ కొంతమంది పెద్ద ఎత్తున డిబేట్ చేసిన విషయం తెలిసిందే. మరీ ఇప్పుడు నటించబోతున్న అప్కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news