ఐఐఎం హాస్టల్ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు

-

విద్యార్థుల ఆందోళనలతో ఐఐఎం కోల్​కతా క్యాంపస్​ హోరెత్తింది. క్యాంపస్​లోని మెస్​లో ఆహారంలో నాణ్యత లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో ఉన్న నాలుగు క్యాంటీన్లలో ఒక క్యాంటీన్​లో ఆహారం బాగోలేదని అన్నారు. ఆహారంలో పురుగులు, ఇనుప తీగలు వస్తున్నాయని ఆరోపించారు.

ఇలాంటి ఘటనలపై యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు  వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక మెస్​ను మూసేశారు సిబ్బంది. అలాగే విద్యార్థుల నిరసనలు నేపథ్యంలో మిగిలిన మూడు మెస్​లను మంగళవారం మూసేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంటీన్ సిబ్బంది వారిని క్యాంపస్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు.

‘గత రెండు నెలలుగా క్యాంపస్​లోని మెస్​లోని ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది  అనారోగ్యం పాలయ్యారు. ఇలా జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు క్యాంటీన్​లో తినడం మానేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్​ చేసినా క్యాంపస్​లోకి రానివ్వట్లేదు.’

-ఐఐఎం విద్యార్థి

Read more RELATED
Recommended to you

Latest news