నదిలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది దుర్మరణం

-

జమ్ముకశ్మీర్ మార్వాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కారు​ అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కిష్త్వార్​ జిల్లాలో బుధవారం సాయత్రం మార్వాలోని రాచల్ ప్రాంత సమీపంలో ఓ కారు వాగులో పడిపోయింది. అందులో ఉన్న నలుగురు మహిళలతో సహా ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు.

సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కారు డ్రైవర్ ​ఉమర్ గని షా.. మహ్మద్ అమీన్, మహ్మద్ ఇర్ఫాన్, అఫాక్ అహ్మద్, ఆసియా బానో, ముజామిలా బానో, సఫూరా బానో, మొహసినా బానోలుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్​ లెప్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, కేంద్ర జితేంద్ర సింగ్​లు స్పందించి మృతులకు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news