ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నాకు ఎలాంటి నోటీసులు అందలేదు – రఘురామ

-

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నాకు ఎలాంటి నోటీసులు అందలేదని వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. నిన్నటి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో.. ఎంపీ రఘురామరాజు పాత్ర ఉందని, ఆయన 100 కోట్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నోటీసులపై తాజాగా రఘురామరాజు స్పందించారు. TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు తనకు నోటీసులు పంపారంటూ వార్తలు వస్తున్న వాటిలో నిజం లేదని తెలిపారు. కలలో కూడా అలాంటి పనుల్లో తాను భాగస్వామ్యం కానని పేర్కొన్నారు. ఒకవేళ నోటీసులు అందితే తగిన విధంగా స్పందిస్తానని చెప్పారు. ఢిల్లీలో చాలామంది తనతో ఫోటోలు దిగుతారని, అలాగే ఈ కేసులో కూడా నిందితుడు నందకుమార్ తనతో ఎప్పుడో ఫోటో దిగి ఉంటాడని రఘురామా రాజు క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news