వైసిపి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయి – చంద్రబాబు

-

వైసిపి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని వండిపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మరోసారి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. జగన్ వచ్చాక డ్వాక్రా సంఘాలకు కష్టాలు మొదలయ్యాయని.. డ్వాక్రా సంఘాల గురించి సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు రూ. ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు.

టిడిపి హయాంలో డ్వాక్రా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు. మహిళలను అన్ని రంగాలలో టిడిపి ప్రోత్సహించిందని చెప్పారు. పరదాల మాటున సీఎం జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి కార్యకర్తలపై కేసులు పెడితే తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు తన మంచితనాన్ని చూశారని.. ఇకపై తన కఠినత్వం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక 2014 పరిస్థితులు రాష్ట్రంలో రిపీట్ అవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోసారి జగన్ కు పరాజయం తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news