FIFA వరల్డ్ కప్‌లో ఓటమితో ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు

-

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. రాజధాని పారిస్‌, నైస్‌, లియోన్‌ వంటి అనేక నగరాల్లో భారీగా జనాలు వీధుల్లోకి వచ్చారు. వాహనాలు అడ్డుకుంటూ వీరంగం సృష్టించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫ్యాన్స్ ధాటికి వాళ్లు కూడా తట్టుకోలేకపోయారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. టపాసులు విసిరారు. ఆందోళనలు కట్టడి చేయడానికి పోలీసులు చివరకు టియర్ గ్యాస్ ఉపయోగించారు.

ఆదివారం జరిగిన సాకర్‌ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) కెరీర్‌ చివరి మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతో రెండు గోల్స్‌ కొడితే.. ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌కు పరిమితం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్‌ట్రా టైమ్‌ ఇచ్చారు. అందులోనూ ముందంజలో నిలిచిన అర్జెంటీనా గోల్‌ కొట్టడంతో ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఎంబాపే అద్వితీయ రీతిలో గోల్‌ నమోదు చేయడంతో మరోసారి 3-3తో స్కోర్లు సమమ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించగా.. అందులో అర్జెంటీనా ముందంజ వేసింది. దీంతో 4-3 తేడాతో ఫ్రాన్స్‌ ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news