ఈసీఐఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…

ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ ఈ నోటిఫికేషన్ లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మొత్తం 11 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఇక అర్హత వివరాలని చూస్తే సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈటీసీ/ ఎంసీఎస్‌/ ఈఈఈ పూర్తి చేసినవాళ్లు అర్హులు.

ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో బీఈ, బీటెక్‌ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే పని అనుభవం తప్పని సరిగా ఉండాలి. వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించి వుండకూడదు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారట. సాలరీ విషయానికి వస్తే.. రూ. 25,000 నుంచి రూ. 31,000 వరకు పే చేస్తారు.
ఎంపికైతే అండమాన్ & నికోబార్, ముంబయి, నాలియాలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 26-12-2022 వరకే అవకాశం ఉంది. పూర్తి వివరాలని https://careers.ecil.co.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news