పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన యువకుడు

-

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు మంగళవారం రాత్రి ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్‌ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కొద్దిరోజులుగా గొడవలు పడుతున్నారు. ఇదే విషయంపై శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి నిలదీశాడు. అంగీకరించకపోవడంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు అతడిని చితకబాదారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు గ్రామానికి చేరుకుని యువతిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news