ఫిబ్రవరి 17 న సచివాలయ భవనం ప్రారంభోత్సవం – ప్రశాంత్ రెడ్డి

-

ఫిబ్రవరి 17 న సచివాలయ భవనం ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే తదుపరి మంచిరోజున సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో సర్కార్ ఉంది.

ఈ తరుణంలోనే, తాజాగా దీనిపై ప్రకటన వచ్చింది. నూతనంగా నిర్మితమైన డా.బి.అర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవం సమయం ఖరారు చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం రోజైన ఫిబ్రవరి 17 న సీఎం కేసీఆర్ చేతులమీదుగా జరపాలని నిర్ణయించామని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news