రిపబ్లిక్ డే వేడుకలు ఎలా చేయాలో మాకు తెలుసు – ఎమ్మెల్సీ పల్లా

-

రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో మాకు తెలుసని అన్నారు ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్ రెడ్డి. బుధవారం హైదరాబాద్లోని టిఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ఒక మాట అనలేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోటోకాల్ పాటిస్తుందని స్పష్టం చేశారు.

గవర్నర్ తనకు తానే అవమానం జరిగిందని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ పల్ల. గవర్నర్ కి బిజెపి ప్రోటోకాల్ దొరకదు తప్ప ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోటోకాల్ పాటిస్తుందని వెల్లడించారు. గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని.. యూనివర్సిటీ నియామకాల బిల్లు గవర్నర్ తొక్కి పెట్టారని చెప్పారు. కాగా అనివార్య కారణాలతొ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమని ప్రభుత్వం గవర్నర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news