ఎగ్జామ్​ హాల్​లో 500 మంది అమ్మాయిలు.. చూసి స్పృహ తప్పిపడిపోయిన విద్యార్థి

-

బిహార్‌లోని నలందాలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి ఎగ్జామ్ హాల్​లో 500 మంది అమ్మాయిలు ఉండటం చూసి భయపడి అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. గమనించిన సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

మనీశ్‌ శంకర్‌(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌కు తీసుకొచ్చాడు. బుధవారం షెడ్యూల్‌ ప్రకారం గణిత పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్‌ హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో ఉన్న బాలికలను చూసి విద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. ఒకేసారి అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్‌ కంగారుపడి స్పృహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news