ఘనంగా రవితేజ హీరోయిన్ పెళ్లి.. వరుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి బ్యాచిలర్స్ అంతా వివాహం చేసుకుంటున్నారు. తాజాగా నేమింతే హీరోయిన్ అదితి గౌతమ్ అలియాస్ షియా గౌతమ్ కూడా వివాహం చేసుకుంది. సోమవారం రాత్రి ముంబైలో ఘనంగా వీరి వివాహం జరిగినట్లు సమాచారం. అయితే తన పెళ్లి విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసి ఆమెకు పెద్ద ఎత్తున నెటిజెన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో అదితి గౌతమ్ వివాహం చేసుకుంది. ఇకపోతే ఆమె వివాహం చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అదితి గౌతమ్ వివాహం చేసుకున్న వ్యక్తి పేరు నిఖిల్ పాల్కేవాలా… ఈయన ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఈ వేడుకలో హీరోయిన్ ప్రియమణి కూడా పాల్గొని సందడి చేశారు. షియాకు ప్రియమణి మంచి స్నేహితురాలు కావడంతో ఆమెను ప్రత్యేకంగా ఈ వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ప్రియమణితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్లి వేడుకలో హాజరయ్యి సందడి చేసినట్లు సమాచారం.. అయితే అదితీ గౌతమ్ ది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరిచిన వివాహమా? అనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. మొత్తానికైతే ఈ జంట చూడముచ్చటగా ఉంది అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె విషయానికి వస్తే బాలీవుడ్ మోడల్ అయిన ఈమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ సరసన నేనింతే అనే సినిమా ద్వారా 2008లో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని వేదం సినిమా చేసి.. ఇప్పుడు పక్క కమర్షియల్ లో కూడా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news