IPL ఫ్యాన్స్​కు గుడ్​​న్యూస్​..

-

ఐపీఎల్ అభిమానులకు ముఖేష్‌ అంబానీ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్‌ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల డిజిటల్‌ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ రెండూ పాయింట్‌ ఏడు బిలియన్‌ డాలర్లు చెల్లించింది.

తద్వారా ఈ పోటీలో వాల్ట్‌ డిస్నీ కంపెనీని మరియు సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌ను పక్కకు నెట్టేసింది. వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది పారామౌంట్‌ గ్లోబల్‌ మరియు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ల జాయింట్‌ వెంచర్‌. ఈ సంస్థ ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేయటం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలు వాటిని చూసేలా చేయనుంది. ఫలితంగా యాడ్స్‌ రూపంలో ఎక్కువ ఆదాయం పొందాలని భావిస్తోంది. అయితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత ప్రసారానికి సంబంధించి వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news