BREAKING : ముగిసిన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు

-

జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిసాయి.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

కాగా, నిమ్స్‌లో అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణంపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news