వరద బాధితులకు విన్స్ బయోప్రోడక్ట్స్ సంస్థ భారీ విరాళం..!

-

తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ రూ.51 లక్షల విరాళం అందించింది. ఆ సంస్త చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్దార్థ డాగా శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు.

ఇటీవల వచ్చిన వరదలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతులం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరద బాదితులకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో ప్రముఖులు, సెలబ్రీటీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news