ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

-

తెలంగాణలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గవర్నర్ కోట కింద నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లు కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో చోటు చేసుకున్న రాజకీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇండ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ పై చర్చించే అవకాశం ఉంది. సొంత స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో విడత గొర్రెల పంపిణీ పై కేసీఆర్ సమీక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news