జగన్ హయాంలో హత్యా రాజకీయాలు లేవు – బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

-

జగన్ హయాంలో హత్యా రాజకీయాలు లేవన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి లో శాంతి నెలకొందన్నారు.

జగన్ హయాంలో హత్యా రాజకీయాలు లేవని.. జేసీ బ్రదర్స్ కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అని నిలదీశారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్లుగా రాజరిక పాలన నడిపారని.. రాయలసీమ లో 30 నియోజకవర్గాల్లో టీడీపీ కి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. మళ్లీ జగన్‌ దే అధికారమని చెప్పారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news