జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పై లోకేష్ సెటైర్లు…అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు !

-

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు విసిరారు. అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అంటూ చురకలు అంటించారు లోకేష్‌. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. నిన్న రాత్రి 7:30 గంటలకు ఆయన హస్తినకు పయనం అయ్యారు సిఎం జగన్.

ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ టూర్‌ పై టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు విసిరారు. అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అని జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్న‌ట్టు? అంటూ చురకలు అంటించారు. ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్నుని కాపాడ‌టానికి… సీబీఐ అధికారి బ‌దిలీ కోసమా… లిక్క‌ర్ స్కాంలో బుక్క‌యిన ఎంపీ కోసమా ? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news