వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి: అవన్నీ పుకార్లే ఎవ్వరూ నమ్మొద్దు !

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా… ప్రభుత్వం గురించి నెగటివ్ కామెంట్ చేయకుండా ఉన్నా కూడా ప్రతిపక్ష టీడీపీ కి చెందిన నాయకులు కావాలనే పని కట్టుకుని వైసీపీ గురించి మరియు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ల గురించి చెడుగా ప్రచారాలు చేస్తూ వస్తోంది. ఇటీవల తమకు వచ్చిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను పట్టుకుని వైసీపీ పఠనం గురించి ఆలోచించడం వారి మూర్ఖత్వానికి తార్కాణం. ప్రజల అండదండలు మెండుగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు అన్న విషయాన్ని టీడీపీ అర్ధం చేసుకోవాలని వైసీపీ నాయకులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన మరో వదంతు వైసీపీ అభిమానులను ఆందోళనకు గురి చేసింది అని చెప్పాలి. నెల్లూరు జిల్లాకు చెందిన ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని.. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనంటూ కొట్టిపారేశారు. జీవితాంతం మేము మా ఫ్యామిలీ జగన్ తోనే ఉంటుందని ఘంటాపధంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news