MS Dhoni: రెండున్నర కోట్లా..? ధోని రెండు సిక్సులకే అంత దద్దరిల్లింది

-

ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు మరో ఓటమి ఎదురైంది. నిన్న రాత్రి చెన్నై లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయకేతనాన్ని ఎగురవేసింది.

కాగా ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కు మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షల జరిమానా విధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో 17 బంతులు ఎదుర్కొన్న ధోని.. ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. అయితే..నిన్నటి మ్యాచ్‌ లో ధోని బ్యాటింగ్‌ కు రాగానే.. డిజిటల్‌ బ్రాడ్‌ కాస్టర్‌ జియో సినిమా వ్యూస్‌ రూ. 2 కోట్ల మార్క్‌ ను దాటింది. ఆఖరి ఓవర్‌ రెండు సిక్సులు బాదిన తర్వాత.. ఆ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇదే జియో సినిమాకు ఆల్‌ టైమ్‌ రికార్డు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news