వైఎస్ వివేకా హత్య కేసుపై షర్మిల కీలక వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. వైయస్ వివేకానంద రెడ్డి (మా చిన్నాన్న) పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని అన్నారు. ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. ఆస్తులన్నీ సునీత పేరు పైనే ఉన్నాయన్నారు షర్మిల. ఆస్తుల కోసం మా చిన్నాన్నను హత్య చేయలేదన్నారు.

వివేక వ్యక్తిగత జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. వివేక గురించి పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. చనిపోయిన వ్యక్తి పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. వివేకానంద రెడ్డి ప్రజల మనిషి అన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయన గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు షర్మిల. వివేకానంద రెడ్డి పై వారు చేస్తున్న కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news