IPL 2023 : అగ్ర స్థానానికి గుజరాత్..ఈ సారి కప్ వాళ్లదేనా

-

KKRతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. తాజా విజయంతో మూడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. మొత్తం 8 మ్యాచుల్లో ఆరు విజయాలతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ పది పాయింట్లతో ఉన్నాయి.

ఇక ఆర్సిబి, పంజాబ్ చెరో 8 పాయింట్లతో 5,6 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ మధ్యాహ్నం 3:30 గంటలకు తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై… రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ నిలకడగా రాణిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news