BREAKING : జగనాసురుడు.. అవినీతి, నేరాల రాక్షసుడు పేరుతో టీడీపీ క్యాంపెయిన్

-

టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనాసురుడు.. అవినీతి, నేరాల రాక్షసుడు పేరుతో టీడీపీ క్యాంపెయిన్ చేయనుంది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నారు టీడీపీ నేతలు. ఇదే అంశంపై ప్రజల్లోకి వెళ్లేలని టీడీపీ ప్రణాళికలు చేస్తోంది. బుక్ లెట్, కరపత్రాలను పంపిణీ చేయనుంది టీడీపీ.

ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. కాగా, కుప్పంలో హింసపై డీజీపీకి చంద్రబాబు లేఖ‍ రాశారు. టీడీపీ నేత వి.బాలకృష్ణ పై, ఆయన ఇంటిపై వైసీపీ గూండాలు రాడ్లు, కర్రలతో నేడు దాడికి పాల్పడ్డారని.. బాలకృష్ణకు చెందిన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని వివరించారు.

కుప్పంలో వైసీపీ కారణంగా హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని.. నేను 1989 నుండి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని లేఖలో చంద్రబాబు..వెల్లడించారు. ఇన్నాళ్లూ కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వం కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో హింసాత్మక చర్యలు మొదలు పెట్టిందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news