బీజేపీలో చేరికలపై విజయశాంతి సంచలన ట్వీట్‌

-

బీజేపీలో చేరికలపై విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. బీజేపీలో చేరికలపై చేరికలకమిటీ ద్వారా జరిగే ప్రయత్నం పార్టీ నిర్మాణానికి నిరంతరం జరిగే ప్రక్రియ. వాటిని బీజేపీ నాయకత్వం, అధ్యక్షులు, జాతీయ పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం విధానపరంగా నడుస్తుందన్నారు.

కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికలయ్యాక బీఆరెస్‌లో చేరిపోవడం తెలంగాణలో జరుగుతున్నదే కాబట్టి, ప్రజలు బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనుకుంటున్న వాస్తవాన్ని నిన్నటి బీజేపీ చేరికల కమిటీతో సమావేశమైన… బీఆరెస్‌ను వ్యతిరేకిస్తున్న నేతలుకూడా ప్రజాభిప్రాయం దృష్ట్యా అర్థం చేసుకోగలుగుతారని అభిప్రాయపడుతున్నానని చెప్పారు రాములమ్మ. ఏది ఏమైనా కేసీఆర్ గారి అవాస్తవ, మోసపు వాగ్దానాల, అవినీతి, దోపిడీ ప్రభుత్వాన్ని బీజేపీ తప్ప మరే ఇతర పార్టీ నిలువరించి, సాధించలేదు అనేది తెలంగాణ ప్రజల ఇప్పటి వాస్తవ విశ్వాసం అన్నారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news