తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి కొట్టు ఫైర్

-

తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు చేసిన అభివృద్ధి నేటి తెలంగాణ అని అన్నారు. ఇది మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.

ముందు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని హితవు పలికారు. రాబోయే ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని, మీ భవిష్యత్తును చూసుకోవాలని అన్నారు.BRS పార్టీని ప్రతిపక్షాలు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయని.. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు.తెలంగాణలో టిఆర్ఎస్ ని రెండు ప్రతిపక్షాలు సతమతం చేసి ఊపిరాన్ని ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి టీఆర్ఎస్ మంత్రులకు ఏంటి అర్హత అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news